టబ్ కోసం నీటిలో దిగి యువకుడి గల్లంతు

by Rajesh |
టబ్ కోసం నీటిలో దిగి యువకుడి గల్లంతు
X

దిశ, ఖమ్మం రూరల్​ : టబ్ కోసం నీటిలో దిగి యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన పేరం చంద్రకళ రోజు మాదిరిగానే శుక్రవారం గ్రామ శివారులో గల ఎన్‌ఎస్‌పీ కాలువలో బట్టలు ఉతికేందుకు దిగింది. బట్టలు ఉతుకుతుండగా టబ్ జారి కాలువలో పడింది. వెంటనే చంద్రకళ ఇంటి వద్ద గల తన కుమారుడైన పేరం ఉపేందర్​(22)కు విషయం తెలిపింది.

దీంతో ఉపేందర్ టబ్ కోసం నీటిలోకి దిగాడు. ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో పడి గల్లంతయ్యాడు. అక్కడ బట్టలు ఉతుకుతున్న స్థానికులు విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. నీట మునిగిన యువకుడి జాడ ఇంకా తెలియలేదు. సమాచారం అందుకున్న రూరల్​ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఉపేందర్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. చేతికొచ్చిన కొడుకు కాలువలో గల్లంతవ్వడంతో తల్లిదండ్రులు, బందువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Next Story

Most Viewed