రైతు సమస్యలపై బీజేపీ దీక్ష : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

by M.Rajitha |
రైతు సమస్యలపై బీజేపీ దీక్ష : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతు సమస్యలపై దీక్ష చేపట్టనున్నట్లు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై పది అంశాల ఎజెండాతో పోరాడాలని నిర్ణయించినట్లు తెలిపారు. రుణమాఫీ అవ్వక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, అందరికీ రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే రైతు దీక్ష చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ చర్చించి తేదీ ఫిక్స్ చేసుకుంటామని, ఈనెల 20న లేదంటే ఆ వారంలో దీక్ష చేపడుతామని ఏలేటి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విమోచన దినోత్సవం నిర్వహించాలని సీఎం కు లేఖ రాయాలని డిసైడ్ అయినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరద సహాయంపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మంత్రుల మధ్య సఖ్యత లేదని ఏలేటి వెల్లడించారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed