వీఆర్వో అదృశ్యం కేసులో ట్విస్ట్.. బయటపడ్డ సూసైడ్ నోట్!?

by Jakkula Mamatha |
వీఆర్వో అదృశ్యం కేసులో ట్విస్ట్.. బయటపడ్డ సూసైడ్ నోట్!?
X

దిశ, పల్నాడు:ముప్పాళ్ళ మండలం నార్నెపాడు వీఆర్వో మల్లికార్జునరావు అదృశ్యం కేసులో కొత్త ట్విస్ట్ కలకలం రేపుతోంది. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీఆర్వో రాసిన సూసైడ్ నోట్ గురువారం బయటపడటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నా చావుకు ఎవరూ కారణం కాదు. ఇల్లు ఒక నరకంగా మారిపోయింది. ఏదో తెలియని మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నాను. అక్క బావ నన్ను క్షమించండి. ఈ జన్మకు ఇక సెలవు అంటూ సూసైడ్ నోట్‌లో రాయటం ఆందోళన కలిగిస్తోంది.

వీఆర్వో మిస్సింగ్ పై భిన్న వాదనలు..

మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు విచారణలో కొన్ని కొత్త విషయాలు గుర్తించినట్టుగా తెలుస్తోంది. వీఆర్వో మల్లికార్జునరావుకు ఇటివలే వివాహం జరిగింది. తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేయడం కారణంగా వీఆర్వో మనస్తాపానికి గురైనట్లుగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని విఆర్వో ఇంట్లో అమ్మానాన్నల ఆనందం కోసమే చేసుకున్నాను కానీ అది నా మనసుకు ఎక్కటం లేదు. క్షమించరాని తప్పు చేశాను అంటూ సూసైడ్ నోట్ లో నర్మగర్భంగా ప్రస్తావించారు.

కాల్ డేటా పై ఆరా తీస్తున్న పోలీసులు..

వీఆర్వో మల్లికార్జునరావు సూసైడ్ నోట్ లో రాసిన అంశాలు ఆధారంగా వాస్తవంగా మనస్తాపంతోనే ఇలా రాశాడా లేదా కనిపించకుండా పోవడానికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీఆర్వోకు ఓ సహచర ఉద్యోగినితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు గా తెలుస్తోంది. ఈ క్రమంలో అతని కాల్ డేటా సేకరించి ఎవరితో మాట్లాడుతున్నాడు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు గా సమాచారం. అయితే విఆర్వో తరచు శ్రీశైలం వెళ్లే వాడిని తెలుసుకున్న పోలీసులు అతని ఆచూకీ గుర్తించడం కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని అక్కడకు పంపించి గాలిస్తున్నారు.

Next Story