స్నానానికి వెళ్లి నదిలో భక్తుడు మృతి

by Jakkula Mamatha |
స్నానానికి వెళ్లి నదిలో భక్తుడు మృతి
X

దిశ, శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలోని స్వర్ణముఖి నదిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా కార్వేటి నగరానికి చెందిన చంద్రశేఖర్ (35) శుక్రవారం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయడానికి కైలాస గంగా స్నాన ఘట్టానికి వెళ్లగా ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయి మరణించాడు. స్నాన ఘట్టం వద్ద నది లోతుగా ఉండడంతో భక్తుడు మరణించినట్లు స్థానికులు తెలిపారు. దేవస్థానం ఎటువంటి సూచిక బోర్డులను ఏర్పాటు చేయక పోవడం వల్ల భక్తుడు దుర్మరణం పాలయ్యాడని భక్తులు అంటున్నారు.

Advertisement

Next Story