పుట్టిన కొద్ది నిముషాల్లోనే శిశువు కిడ్నాప్.. సంగారెడ్డిలో దారుణం

by M.Rajitha |   ( Updated:2024-10-09 11:30:00.0  )
పుట్టిన కొద్ది నిముషాల్లోనే శిశువు కిడ్నాప్.. సంగారెడ్డిలో దారుణం
X

దిశ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. పురిటిలోనే ఆడశిశువును అపహరించారు దుండగులు. ప్రస్తుతం ఈ ఘటన పట్టణంలో కలకలం రేపుతుండగా.. పోలీసులు ఏం చెబుతున్నారంటే.. మానూరు మండలం దూదిగొండకు చెందిన ఓ మహిళ కాన్పుకోసం మంగళవారం రాత్రి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేరింది. ఆడశిశువుకు జన్మనిచ్చిన కాసేపటికే.. ఆ శిశువు కనబడకుండా పోయింది. శిశువు అపహరణకు గురైన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, ఆసుపత్రి సిబ్బంది సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి సీసీ టీవీ ఫుటేజీ గమనించిన పోలీసులకు బాధిత మహిళా ప్రసవ సమయంలో ముగ్గురు మహిళలు అనుమానస్పదంగా తిరగడం గమనించారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story