మహబూబ్ నగర్ లో మరొకరికి కరోనా

by vinod kumar |
మహబూబ్ నగర్ లో మరొకరికి కరోనా
X

దిశ, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మరో కరోనా కేసు నమోదైంది. పట్టణంలోని వన్ టౌన్ సమీపంలోని శివశక్తి నగర్ లో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. వెంటనే అధికారులు ఈ ప్రాంతాన్ని క్వారంటైన చేసి హైడ్రోక్లోరిన్ ద్రవాన్ని పిచికారీ చేయించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబంతో పాటు అతని స్నేహితులను అధికారులు గుర్తించి నమూనాలను సేకరించి వారిని క్వారంటైన్ చేశారు. కరోనా సోకిన యువకుడు ఇటీవల ముంబై వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ ప్రాంతంలో పర్యటించి వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.

Advertisement

Next Story