నిజామాబాద్‌లో మరో ఎమ్మెల్యేకు సోకిన కరోనా

by vinod kumar |
నిజామాబాద్‌లో మరో ఎమ్మెల్యేకు సోకిన కరోనా
X

దిశ, నిజామాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేలను కరోనా కలవరపెడుతోంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా‎కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. హైద్రాబాద్‎లో వైద్యులు సోమవారం ఖరారు చేసినట్టు సమాచారం. అర్బన్ ఎమ్మెల్యే చివరగా 13న జిల్లా కేంద్రంలో కార్పొరేటర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ వచ్చిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను.. బిగాల గణేష్ గుప్తా కలిసినట్టు తెలుస్తోంది. శనివారం జిల్లా కేంద్రం‎కు వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎవరిని దగ్గరగా కలువలేదని.. సొంతంగా కారు నడుపుకుంటూ వచ్చారు అని అనుచరులు చెబుతున్నారు. గణేష్ గుప్తా కుటుంబ సభ్యులను, సహాయకులను అధికారులు హోం క్వారంటైన్‎కు పంపారు.

Advertisement

Next Story

Most Viewed