భార్య కాపురానికి రాలేదని..కానిస్టేబుల్ ఆత్మహత్య

by Sridhar Babu |
భార్య కాపురానికి రాలేదని..కానిస్టేబుల్ ఆత్మహత్య
X

దిశ‌, ఖ‌మ్మం: కట్టుకున్న భార్య కాపురానికి రాలేదని మనస్తాపం చెందిన ఓ కానిస్టేబుల్ తనువు చాలించాడు. తన ఇంట్లోనే తెల్లవారు జామున ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకర్ గిరి తండాలో గురువారం చోటుచేసుకుంది.వివరాల్లోకివెళితే.. శంకర్ గిరి తండాకు చెందిన బాషా, అంకిత భార్యాభర్తలు. అతను ఐటీబీపీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే గత కొంతకాలంలో దంపతుల మధ్య దూరం పెరగడంతో అంకిత పుట్టింటికి వెళ్లిపోయింది.ఎన్నిమార్లు కాపురానికి రావాలని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన బాషా తెల్ల‌వారు జామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. త‌న చావుకు భార్య అంకిత‌, అత్త విజ‌య‌, మామ భూక్య వీర‌న్న‌లే కార‌ణ‌మ‌ని సూసైడ్ రాసి పెట్టాడు. అంకిత కాపురానికి రాక‌పోవ‌డంతోనే గత కొద్ది రోజులుగా బాషా దిగాలుగా ఉంటున్నట్లు మృతుడి కుటుంబ‌స‌భ్యులు వెల్లడించారు. వారి ఫిర్యాదు మేరకు నేల‌కొండ‌ప‌ల్లి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story