‘ఆ చట్టంలో… కొన్ని సెక్షన్లు మార్చాలి’

by  |
‘ఆ చట్టంలో… కొన్ని సెక్షన్లు మార్చాలి’
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసన సభలో శుక్రవారం కొత్త రెవెన్యూ చట్టంపై సుదీర్ఘ చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ అంశంపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ… జాగీర్ భూముల అంశాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు. లీగల్ లిటిగేషన్‌కు ఆస్కారం లేకుండా బిల్లు రూపొందించాలని తెలిపారు.

కాగా కొత్త రెవెన్యూ చట్టంలో రికార్డింగ్‌ అథారిటీని తెలుపలేదని సూచించారు. ఎటువంటి సమస్యలు లేకుండా బిల్లులు రూపొందించడంతో పాటు, ఈ నూతన చట్టంలో కొన్ని సెక్షన్లను మార్చాలని అన్నారు. అంతేగాకుండా వివరాలు నమోదు చేసే అధికారం ఎవరికిచ్చారో కూడా స్పష్టత లేదని ఆరోపించారు.


Next Story

Most Viewed