విశాఖకు చేరిన చైనా షిప్..

by srinivas |
విశాఖకు చేరిన చైనా షిప్..
X

చైనా నుంచి బయలు దేరిన కార్గో షిప్ విశాఖ తీరానికి చేరుకుంది. అందులోని సిబ్బందికి ముందుగా థర్మల్ స్క్రీనింగ్ చేశాకే దేశంలోనికి అనుమతిస్తామని నావెల్ సిబ్బంది తెలిపారు. చైనా నుంచి వచ్చిన షిప్‌లో 21మంది కరోనా అనుమానితులు ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో ఎవరికైనా పాజిటివ్ అని తేలితే వెంటనే వారికి ప్రత్యేకంగా చికిత్స అందజేస్తామని వైద్యాధికారులు తెలిపారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో శనివారం సీఎం జగన్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం.

Tags: china ship, vizag coastal area, 21 mem suspected, coronavirus, cm jagan review meet

Next Story

Most Viewed