కడపలో పర్యటించనున్న సీఎం జగన్.. ఎందుకంటే ?

by srinivas |
కడపలో పర్యటించనున్న సీఎం జగన్.. ఎందుకంటే ?
X

దిశ, వెబ్ డెస్క్: రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం జగన్ కడప జిల్లాకు వెళ్లనున్నారు. అక్టోబర్ 2 వ తేదీ మధ్యాహ్నం తాడేపల్లి లోని తన నివాసం నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఇడుపుల పాయలోని హెలిప్యాడ్ వద్ద స్థానిక నాయకులతో కాసేపు మాట్లాడి వైఎస్సార్ ఎస్టేట్ కు చేరుకుంటారు. అక్కడే రాత్రికి బస చేస్తారు.

ఆదివారం ఉదయం సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి ప్రథమ వర్ధంతిని సందర్భంగా 10 గంటలకు పులివెందుల లోని లయోలా డిగ్రీ కాలేజీ రోడ్డులో ఉన్న సమాధి వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి 10.30 కి భాకరాపురం లోని ఆడిటోరియంలో జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. తర్వాత అక్కడి నుంచి భాకరాపురంలోని నివాసానికి వెళ్తారు. మధ్యాహ్నం 12.40 కి కడపలోని విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 1.30కి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. తర్వాత రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

Next Story

Most Viewed