Alai Balai : అలయ్ బలయ్‌కి రండి.. మంత్రి పొన్నం, మధుయాష్కీకి ఆహ్వానం

by Ramesh N |
Alai Balai : అలయ్ బలయ్‌కి రండి.. మంత్రి పొన్నం, మధుయాష్కీకి ఆహ్వానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: అలయ్ బలయ్‌ కార్యక్రమానికి రావాలని కాంగ్రెస్‌లోని కీలక నేతలకు ఆహ్వానాలు అందుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరుకావాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆహ్వానించారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి పొన్నం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అదేవిధంగా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ‌ని విజయలక్ష్మి అహ్వానించారు. ఈ క్రమంలోనే ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు.

కాగా, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా దసరా పండుగ సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ, ఆయన కుటుంబ సభ్యులో ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. తెలంగాణ వంటకాలతో ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు, అధికారులు, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరిని ఆయన ఆహ్వానిస్తారు. ఈ కార్యక్రమానికి అతిథులను దత్తాత్రేయ, ఆయన కుమార్తె స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తున్నారు. దత్తాత్రేయ ఇప్పటికే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని ఈ కార్యక్రమానికి రావలసిందిగా కోరారు.

Advertisement

Next Story

Most Viewed