మెగా ఫ్యామిలీకి షాక్.. పెళ్ళైయ్యాక వరుణ్ తేజ్ లావణ్యతో వెళ్లిపోవాల్సిందేనా?

by Hamsa |
మెగా ఫ్యామిలీకి షాక్.. పెళ్ళైయ్యాక వరుణ్ తేజ్ లావణ్యతో వెళ్లిపోవాల్సిందేనా?
X

దిశ, వెబ్ డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జూన్ 9న అత్యంత తక్కువమంది సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్నారు. అయితే అప్పటి నుంచి వీరికి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా, వరుణ్, లావణ్య పెళ్లి జరిగాక నాగబాబు కుటుంబం మూడు ముక్కలు కానుందంటూ ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఇప్పటికే నిహారిక తండ్రికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

ఎందుకంటే విడాకుల విషయంలో నాగబాబు నిహారికను ఎంత ఒప్పించినా కూడా ఆమె వినకపోయేసరికి నాగబాబుకి నిహారికకు గొడవలు వచ్చాయట. ఈ కారణంతో నిహారిక తండ్రి తో ఉండకుండా వేరే ఫ్లాట్‌లో ఉంటున్నట్లు సమాచారం. ఇక పెళ్లయ్యాక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ఉండడం కోసం ఇప్పటికే ఒక ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. పెళ్లయ్యాక వరుణ్‌ని తీసుకుని లావణ్య ఆ బంగ్లాలోనే కాపురం చేస్తోందని సమాచారం. ఈ విధంగా నాగబాబు పద్మజ ఒక ఇంట్లో ఉంటే, వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మరో ఇంట్లో ఉంటారని, నిహరిక మరో ఫ్లా‌ట్‌లో ఇలా ముగ్గురు మూడు కుటుంబాలుగా విడిపోబోతున్నారని తెలుస్తోంది. ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అది విన్న వారు మాత్రం మెగా ఫ్యామిలీ గురించి రకరకాలుగా అనుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed