ధోనీ అభిమానులకు శుభవార్త

by Anukaran |
ధోనీ అభిమానులకు శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దారుణంగా విఫలం చెందుతోంది. వరుస ఓటములతో సీఎస్కే అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోది. గత సీజన్లలో దూకుడుగా ఆడి ఐపీఎల్‌లోని మజాను రుచి చూపించిన ఆ జట్టు ఈ సారి మాత్రం ఘోరంగా విఫలం కావడం గమనార్హం. దీంతో సోషల్ మీడియాలో ధోనీ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోవాలని, జట్టును ప్రక్షాళన చేయాలనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈఓ విశ్వనాథన్ ధోనీ అభిమానులకు శుభవార్త చెప్పారు. 2021లోనూ సీఎస్కే కెప్టెన్ ధోనీనే ఉంటాడని స్పష్టం చేశారు. అయితే ఈ సారి సీఎస్కే లీగ్ దశలోనే వెనుదిరగడం బాధాకరం అన్నారు. అయితే రైనా, హర్భజన్ లేకపోవడం, కరోనా కేసులు మా జట్టుపై తీవ్ర ప్రభావం చూపాయని అని వెల్లడించారు.

Next Story