కేంద్ర మంత్రి సురేశ్ అంగడీ ఇకలేరు..

by  |
కేంద్ర మంత్రి సురేశ్ అంగడీ ఇకలేరు..
X

దిశ, వెబ్‌డెస్క్ :

కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేవ్ అంగడీ కన్నుమూశారు. అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి బుధవారం సాయంకాలం మరణించారు.

కర్ణాటకలోని బెళగావికి చెందిన ఆయన వరుసగా నాలుగు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు. ఈనెల 11న కేంద్రమంత్రి కరోనా బారిన పడగా చికిత్స కోసం ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. రికవరీ అవుతున్నారనుకునే క్రమంలో సురేశ్ అంగడీ ఇకలేరనే వార్త తెలిసి రాజకీయ ప్రముఖులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.


Next Story

Most Viewed