రైతుల పిల్లలకు భారీ గుడ్‌న్యూస్.. పెళ్లిళ్లలకు రూ. 50 వేల సాయం?

by Disha Web Desk 9 |
రైతుల పిల్లలకు భారీ గుడ్‌న్యూస్.. పెళ్లిళ్లలకు రూ. 50 వేల సాయం?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నేతలు హామీలు గుప్పించడం సాధారణమే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జోరు నడుస్తోంది. కాగా ఈ సందర్భంగా ఏపీ రాజకీయ నేతలు హామీల వర్షం కురిపిస్తున్నారు. మా పార్టీ అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామని జనాలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ నేడు ఉదయం 11 గంటలకు నవరత్నాలు ప్లస్ పేరుతో వైసీపీ మేనిఫెస్తోను రిలీజ్ చేయనున్నారు. కాగా పాత పథకాల ఆర్థిక సాయాన్ని పెంచి.. కొత్తగా రైతుల పిల్లల పెళ్లిళ్లకు 50 వేల రూపాయలను అందిస్తామని ఇందులో ప్రకటించనున్నారని సమాచారం. అంతేకాకుండా చిరువ్యాపారులకు అందజేస్తున్న నగదును రూ. 15 వేలకు పెంచుతారట. గ్రోత్ సెంటర్లను ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇప్పిస్తారని తెలుస్తుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు యువతులకు 3 వేల రూపాయలు, యువకులకు 2500 రూపాయలు స్టైఫండ్ అందజేస్తామని ఈ మేనిఫెస్తోలో ప్రకటించనున్నారట.



Next Story

Most Viewed