- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీ నిరంకుశ పాలనకు బుద్ధి చెప్పాలి : తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం
దిశ,బెల్లంపల్లి : పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో నియంతృత్వ పాలలను సాగిస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. మంచిరాల జిల్లా బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీజేపీ పాలనలో దేశ సంపదను ప్రధానమంత్రి అదాని, అంబానీ, కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నాడని మండిపడ్డారు. బీజేపీ వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడడంతో రాజ్యాంగ పరిరక్షణ కోసమే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదన్నారు. ఆర్థిక, సామాజిక, ప్రజాస్వామ్య
లౌకిక అసమానతలు మునుపెన్నడూ లేనివిధంగా పెరిగాయన్నారు. ప్రజాస్వామ్యం కోసం మాట్లాడే గొంతులను ప్రధానమంత్రి మోడీ నొక్కి వేస్తున్నాడని విమర్శించారు. కనీసం మాట్లాడే హక్కు లేకుండా పోయిందని వాపోయారు. అదాని, అంబానీల ఆస్తులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై రూ.58 లక్షల కోట్ల పన్నుల భారం మోపిందన్నారు. రాజ్యాంగాన్ని సవరించే ఆలోచనను బీజేపీ చేస్తుందని, మోడీ కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజలు ఆయన్ని గద్దె దింపాలని కోరారు. ప్రజలిచ్చే తీర్పుపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.