ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఇంటి దొంగల చేతివాటం..

by srinivas |
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఇంటి దొంగల చేతివాటం..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల్లో ఇంటి దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. లక్షల రూపాయలు అవకతవకలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లాలోని ఎక్సైజ్ సర్కిల్-4లోని రెండు షాపుల్లోని అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడ్డట్లు సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది సంతకం, స్టాంప్ ఫోర్జరీ చేసి రూ.లక్షలు కాజేసినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి విచారణ జరుగుతోందని వెల్లడించారు. ప్రస్తుతానికి ఎంత డబ్బు కాజేశారో ఇంకా నిర్దారణ కాలేదన్నారు. విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed