ప్రతి ఏటా క్రిస్మస్ రోజు చర్చికి చంద్రబాబు.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

by srinivas |
ప్రతి ఏటా క్రిస్మస్ రోజు చర్చికి చంద్రబాబు.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి ఏటా క్రిస్మస్ రోజున చంద్రబాబు(Chandrababu) చర్చికి వెళ్తారని మాజీ మంత్రి పేర్ని నాని(Former minister Perni Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. రంజాన్ రోజు మసీదులో ప్రార్థన చేసే చంద్రబాబు నిఖార్సైన హిందువా అని ఆయన ప్రశ్నించారు. తిరుమల లడ్డూ వివాదం(Tirumala Laddu Controversy)పై నిరసన వ్యక్తం చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ఆలయాల్లో నిర్వహించిన పూజల్లో పేర్ని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మతమేంటో ప్రజలకు తెలుసన్నారు. తిరుమలకు వచ్చే వారందరూ డిక్లసరేషన్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. వెంకన్నపై నమ్మకంతో మాజీ సీఎం జగన్(Former CM Jagan) చాలా సార్లు తిరుమలకు వెళ్లారని తెలిపారు. ఇప్పుడు కొత్తగా జగన్ డిక్లరేషన్ ఇవ్వడమేంటని పేర్ని నాని ప్రశ్నించారు. జగన్ మోహన్ తాత తండ్రి ఏసు ప్రభువును కొలవడం మొదలపెట్టారని, ప్రజలకు తెలసని చెప్పారు. దేవుడికి బూట్లు వేసుకుని పూజ చేసే చంద్రబాబును పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రశంసించడమేంటన్నారు. ఇటీవల క్రిస్టియన్ నటి శ్రీవారిని దర్శించుకున్నారని, ఆమె డిక్లరేషన్ ఇచ్చారా అని పేర్ని నాని నిలదీశారు.

Advertisement

Next Story

Most Viewed