Sama Rammohan Reddy: ఇంతకంటే సిగ్గుచేటు ఏమీ ఉండదు.. కేంద్ర మంత్రి ట్వీట్ పై సామ ఫైర్

by Prasad Jukanti |
Sama Rammohan Reddy: ఇంతకంటే సిగ్గుచేటు ఏమీ ఉండదు.. కేంద్ర మంత్రి ట్వీట్ పై సామ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా అసత్యాలు ప్రచారం చేస్తూ దొరికిపోయారని తెలంగాణ కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. పెరూ దేశానికి చెందిన రైలును కేంద్ర మంత్రి భారతీయ రైల్వేగా చూపున్నారని విమర్శించారు. ఇంతకంటే సిగ్గుచేటు ఏమీ ఉండదని శనివారం ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్ ట్విట్టర్ అకౌంట్ కు సంబంధించిన ఓ ఫోటోను తన పోస్టులో జత చేశారు.

కాగా రైల్వే శాఖ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్ పేరు ఇటీవల తరచూ చర్చనీయాశంగా మారుతున్నది. ఇటీవల సంభవించిన ఘోర రైలు ప్రమాదాల వెనుక మంత్రి వైఫల్యం ఉందని విపక్షాలు భగ్గుమన్నాయి. అశ్వినీ వైష్ణవ్ రీల్స్ మంత్రి అంటూ ఎద్దేవా చేశాయి. ప్రతిపక్షాల వివమర్శలకు గతంలో వైష్ణవ్ పార్లమెంట్ లోనే మా ఫోకస్ అంతా వర్క్ పై ఉంటుందని రీల్స్ పై కాదంటూ కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే భారత దేశంలో తయారవుతున్న రైళ్లకు విదేశాలలో భారీగా డిమాండ్ ఏర్పడుతోందని. చిలీ, కెనడా, మలేషియా వంటి దేశాలు భారత్ నుంచి వందే భారత్ రైళ్లను దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి సంబంధింత వర్గాలు తెలిపారు.

Advertisement

Next Story