- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
బస్సును ఢీ కొట్టిన లారీ.. 41 మంది మృతి.. రోడ్డుపై చల్లాచదురుగా శవాలు
by Sumithra |
X
దిశ, వెబ్డెస్క్ : బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 41 మంది మృతి చెందారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన ఆఫ్రికా దేశమైన మాలిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ప్రయాణికులతో వెళుతున్న బస్సు.. సామగ్రి, కూలీలతో వెళుతున్న లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 41 మంది చనిపోయారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను 20 కిలోమీటర్ల దూరంలోని సెగో పట్టణానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ టైర్ పేలడం వల్ల డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని, దీంతో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతకు క్షతగాత్రులు రోడ్డుపై చెల్లాచెదురగా పడ్డారు.
Advertisement
- Tags
- mali
Next Story