బస్సును ఢీ కొట్టిన లారీ.. 41 మంది మృతి.. రోడ్డుపై చల్లాచదురుగా శవాలు

by Sumithra |
mali
X

దిశ, వెబ్‌డెస్క్ : బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 41 మంది మృతి చెందారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన ఆఫ్రికా దేశమైన మాలిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ప్రయాణికులతో వెళుతున్న బస్సు.. సామగ్రి, కూలీలతో వెళుతున్న లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 41 మంది చనిపోయారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను 20 కిలోమీటర్ల దూరంలోని సెగో పట్టణానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ టైర్‌ పేలడం వల్ల డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని, దీంతో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతకు క్షతగాత్రులు రోడ్డుపై చెల్లాచెదురగా పడ్డారు.

Advertisement

Next Story

Most Viewed