BREAKING: ఇరాన్‌లోని యాజ్డాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 30 మంది దుర్మరణం, 23 మందికి గాయాలు

by Shiva |   ( Updated:2024-08-21 06:37:19.0  )
BREAKING: ఇరాన్‌లోని యాజ్డాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 30 మంది దుర్మరణం, 23 మందికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: సెంట్రల్ ఇరాన్ ప్రావిన్స్ యాజ్డాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాకిస్థానీ యాత్రికులతో వెళ్తున్న బస్సు అతివేగంతో అదుపతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో మొత్తం 30 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 23 మంది తీవ్ర గాయాలయ్యాయి. బస్సు బ్రేకింగ్ సిస్టమ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఇరాన్ ట్రాఫిక్ పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతులంతా ఇరాక్‌లోని కర్బలా గవర్నరేట్‌లో షియా ముస్లింల అర్బయిన్ తీర్థ యాత్రకు వచ్చిన పాకిస్థానీయులుగా ఉన్నతాధికారులు తేల్చారు.

Advertisement

Next Story

Most Viewed