50 ఏండ్లు పాలించిన రాజు కన్నుమూత

by vinod kumar |   ( Updated:2020-11-11 07:22:17.0  )
50 ఏండ్లు పాలించిన రాజు కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: బహ్రెయిన్ ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ అల్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చికిత్స నిమిత్తం అమెరికాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో బుధవారం తుది శ్వాస విడిచినట్టు బహ్రెయిన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఏ కారణంగా మరణించాడో అన్న విషయం పై స్పష్టత ఇవ్వలేదు. ఖలీఫా బిన్ సల్మాన్ బహ్రెయిన్‌కు 1970 నుంచి సుదీర్ఘ పాలన చేస్తున్నారు. 50 ఏండ్లుగా ఆ దేశానికి రాజుగా ఉన్నాడు. ఇటువంటి సమయంలో ఆయన మరణం బహ్రెయిన్ ప్రజలను విషాదంలోకి నెట్టింది.

Advertisement

Next Story

Most Viewed