రోడ్డు ప్రమాదంలో ఏఎస్సై మృతి

by  |
రోడ్డు ప్రమాదంలో ఏఎస్సై మృతి
X

దిశ, కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో ఏఎస్సై మృతి చెందిన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో తిరుపతి అనే వ్యక్తి ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. విధులు ముగించుకుని మంగళవారం అర్థరాత్రి కారులో సుల్తానాబాద్ నుంచి కరీంనగర్ కు వెళ్తున్నారు. ఈ క్రమంలో బొమ్మకల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Next Story

Most Viewed