జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో కేసు

by srinivas |
జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో కేసు
X

దిశ, వెబ్‎డెస్క్: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరోసారి కేసు నమోదైంది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి, మరో 32 మందిపై ఐపీసీ 188 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి పోలీసులు తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి తాడిప్రతి చేరుకున్నారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. దీంతో పోలీస్ యాక్ట్ 30ను ఉల్లంఘించిట్లు పోలీసులు ఆరోపించారు.

Next Story