కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న విభేదాలు

by Naveena |
కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న విభేదాలు
X

దిశ,శాలిగౌరారం: శాలిగౌరారం మండలంలో కాంగ్రెస్ నాయకులు గత కొంతకాలంగా పోటాపోటీగా రెండు వర్గాలు ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా వ్యవహరిస్తున్నారు. వర్గ విభేదాలు కాస్తా మహాత్మా గాంధీ జయంతి రోజున బహిరంగమయ్యాయి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాదురి శంకర్ రెడ్డి,షేక్ ఇంతియాజ్ అహ్మద్ నేతృత్వంలో..మహాత్మాగాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. పోటాపోటీగా మాజీ మండల అధ్యక్షులు ప్రస్తుత డిసిసి ఉపాధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్,జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు దండ అశోక్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నోముల జనార్ధన్ నేతృత్వంలో.. జయంతి వేడుకలు నిర్వహించుకున్నారు. శాలిగౌరారం మండల వాసి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే మందుల సామేల్ అధికార పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ వర్గ విభేదాలు భగ్గుమనడంతో..కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. శాలిగౌరారం మండలంలోని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. ఇలాంటి వర్గ విభేదాలు రెండు వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తే భారీగా నష్టం జరుగుతుందని, కార్యకర్తలు వాపోతున్నారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ,మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు చొరవ తీసుకొని సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.

Next Story

Most Viewed