పడవ బోల్తా.. 100 మంది గల్లంతు

by M.Rajitha |
పడవ బోల్తా.. 100 మంది గల్లంతు
X

దిశ, వెబ్ డెస్క్ : నైజీరియాలోని నైజర్ నదిలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. 300 మందితో వెళ్తున్న ఓ పడవ మునిగి 100 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో అధికంగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా వీరంతా ఓ వేడుకకు వెళ్ళి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే గజ ఈతగాళ్లు, వాలంటీర్లు రంగంలోకి దిగి 150 మందిని రక్షించారు. ఇప్పటివరకు 11 మంది మృతదేహాలు మాత్రమే లభ్యమవగా.. మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు, అధికారులు తెలిపారు. కాగా నైజర్ నదిలో పడవ ప్రమాదాలు జరగడం సాధారణంగా మారింది. గతేడాది నుండి ఇప్పటి వరకు 4 పడవ ప్రమాదాలు జరగగా.. ఇది ఐదవది.

Next Story

Most Viewed