వైసీపీలో కీలక పదవుల భర్తీ.. వివిధ హోదాల్లో 10 మంది నియామకం

by srinivas |
వైసీపీలో కీలక పదవుల భర్తీ.. వివిధ హోదాల్లో 10 మంది నియామకం
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress Party)లో పది కీలక పదవులను భర్తీ చేశారు. వివిధ హోదాల్లో మొత్తం 10 మంది నాయకులను నియమించారు. ఈ మేరకు వైసీపీ అధిష్టానం( YCP Chief)అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్షుడిగా మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, డాక్టర్స్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గోసుల శివభరత్ రెడ్డి, విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడిగా వై. ఈశ్వర్ ప్రసాద్, రాష్ట్ర ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడిగా ఏపీజెక్కోస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ కార్యదర్శులుగా పుత్తా శివశంకర్, చల్లా మధుసూదన్ రెడ్డి, పుత్తా ప్రతాప్ రెడ్డి, ఎ. హర్ష వర్థన్ రెడ్డి, కందుల రవీంద్రారెడ్డిని నియమించారు.

Next Story

Most Viewed