- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ap: మరో పోరుకు సిద్ధమైన వైసీపీ.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress) మరో పోరుకు సిద్ధమైంది. ఎన్నికల అనంతరం తొలిసారి కరెంట్ ఛార్జీల(Current Charges) పెంపుపై ఇప్పటికే నిరసన వ్యక్తం చేసింది. ఇప్పుడు విద్యార్థుల సమస్యల(Students Problem)పై దృష్టి పెట్టింది. మూడు ప్రధాన అంశాలపై ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యార్థులకు వెంటనే ఫీజు రీఎయింబర్స్మెంట్(Fee Reimbursement) చెల్లించాలని డిమాండ్ చేస్తూ మార్చి 12 రాష్ట్రవ్యాప్తంగా నిరసలు చేపట్టాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ‘యువత పోరు’(Yuvatha Poru) పేరుతో ఆందోనలకు దిగేందుకు సిద్ధమైంది. యువత పోరు కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(Mp Yv Subbareddy) విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజు రీఎయింబర్స్ మెంట్, నిరుద్యోగ భృతి, మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఆందోళన చేపడతామని తెలిపారు. విద్యార్థులకు సకాలంలో ఫీజు రీఎయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది మంది నిరుద్యోగ యువతను మోసం చేసిందని ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాణ్యమైన వైద్యం అందించాలని రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించారని, ఐదు కాలేజీలు ప్రారంభోత్సవం జరిగి ఫీజు అడ్మిషన్లు కూడా జరిగాయని, మిగిలిన 11 కాలేజీలు ఈ ఏడాది ప్రారంభించేలా పనులు పూర్తి చేసిన్పటికీ వాటిని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చెప్పారు. అంతేకాకుండా ఆ కాలేజీలను పీపీల మోడ్లో ప్రైవేటుకు అప్పగించి పేద విద్యార్థులకు మెడికల్ చదువులను పేద విద్యార్థులకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మూడు అంశాలపై మార్చి 12న వైసీపీ అధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా యువత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.