హైకోర్టును ఆశ్రయించిన వల్లభనేని వంశీ

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-28 15:15:24.0  )
హైకోర్టును ఆశ్రయించిన వల్లభనేని వంశీ
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని వల్లభనేని వంశీ పిటిషన్‌ బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. వంశీతో పాటు మొత్తం 15 మంది హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీంతో విచారణను వచ్చే వారానికి హైకోర్టు వాయిదా వేసింది. కాగా, గత ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయంపై నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడిచేసి నిప్పుబెట్టిన సంగతి తెలిసిందే. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగులబెట్టారు. దీనిపై టీడీపీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

Next Story