టీడీపీ రిలే దీక్షలో మహిళా నేత మృతి.. లోకేశ్ విచారం

by Seetharam |   ( Updated:2023-09-21 06:16:32.0  )
టీడీపీ రిలే దీక్షలో మహిళా నేత మృతి.. లోకేశ్ విచారం
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని నిరసిస్తూ కాకినాడలో టీడీపీ నిర్వ‌హించిన‌ రిలే దీక్షలో పాల్గొని అస్వ‌స్థ‌త‌కి గురై నగర టీడీపీ మహిళా అధ్యక్షురాలు చిక్కాల సత్యవతి మృతి చెంద‌డంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. చిక్కాల సత్యవతి మృతి బాధాక‌రం అన్నారు. స‌త్య‌వ‌తి మృతితో తెలుగుదేశం పార్టీ ఒక క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన నాయ‌కురాలిని కోల్పోయింది అని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ‌ స‌భ్యుల‌కి లోకేశ్ తన ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. సైకో జ‌గ‌న్ చేయించే అక్ర‌మ అరెస్టులు చంద్ర‌బాబుని ఏమీ చేయ‌లేవు అని అన్నారు. ‘నిజాయితీ, పార‌ద‌ర్శ‌క పాల‌న ఆయ‌న‌కి శ్రీరామ ర‌క్ష‌. మ‌న నాయ‌కుడు క‌డిగిన ముత్యంలా బ‌య‌ట‌కొస్తారు. ద‌యచేసి టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు చంద్రబాబు అరెస్టుపై ఆందోళ‌న చెంద‌వ‌ద్దు, ఉద్వేగానికి గురికావొద్దు’ అని నారా లోకేశ్ కోరారు.

Read More..

వైసీపీపై పోరాటం ఇంతటితో ఆగేది కాదు: బాలకృష్ణ

Advertisement

Next Story

Most Viewed