రెండున్నరేళ్లలో రూ.50 వేల కోట్ల పనులు చేస్తాం : చంద్రబాబు

by M.Rajitha |
రెండున్నరేళ్లలో రూ.50 వేల కోట్ల పనులు చేస్తాం : చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : రానున్న రెండున్నరేళ్లలో రూ.50 వేల కోట్ల పనులు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu) పేర్కొన్నారు. నేడు కేంద్ర కేబినెట్ అమరావతి రైల్వే లైన్(Amaravathi RailwayLine) ఆమోదం తెలిపిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సంవేశం ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ(Narendra Modi)కి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు.. ఏపీలో చేపట్టబోయే పలు ప్రాజెక్టుల గురించి వెల్లడించారు. ఏపీలో చేపపట్టే అన్ని ప్రాజెక్టులకు 3 నెలల్లో భూసేకరణ పూర్తి చేయనున్నట్టు, ఈ మేరకు అధికారులకు ఉత్తర్వులు కూడా జారీ చేశామని తెలిపారు. రూ.18 వేల కోట్లతో చేపడుతున్న బెంగుళూరు-కడప--విజయవాడ ఎక్స్ ప్రెస్ కారిడార్లో కొన్ని సమస్యలున్నాయని అన్నారు. అయినప్పటికీ వాటిని అధిగమించి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. 15 రోజుల్లోగా ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధిస్తామని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 636 కిమీల గ్రీన్ ఫీల్డ్ రోడ్లు పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. హైదరాబాద్ నుం నుంచి మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేను నిర్మిస్తామని తెలియజేశారు. రాబోయే రెండున్నరేళ్లలో రూ.50 వేల కోట్లతో పలు పనులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

Advertisement

Next Story