గిరిజనుల దైన్యం.. మృతదేహాన్ని కర్రకు కట్టి.. కాలినడకన 7 కిలోమీటర్లు!

by karthikeya |
గిరిజనుల దైన్యం.. మృతదేహాన్ని కర్రకు కట్టి.. కాలినడకన 7 కిలోమీటర్లు!
X

దిశ ప్రతినిధి, విజయనగరం: గిరిజనులకు డోలి కష్టాలు తీరడం లేదు. తాజాగా మంగళవారం విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండపర్తికి చెందిన రాజారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఒక కర్రకు మృతదేహాన్ని కట్టుకొని ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ తీసుకెళ్లారు. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు చలించిపోయారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఈ కష్టాలు తీరవా అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed