విశాఖలో అడుగడుగునా నేరాలు.. నిఘా లోపమా..?

by srinivas |
విశాఖలో అడుగడుగునా నేరాలు.. నిఘా లోపమా..?
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ నగరంలో క్రైం పోలీసులకు ఏటీఎం దొంగలు సవాల్ విసురుతున్నారు. నిఘాలో నిర్లక్ష్యంతో అడుగడుగునా నేరాలు జరుగుతున్నాయి. విచ్చలవిడిగా విశాఖలో పెరిగిన దొంగతనాలకు తోడు ఏటీఎంల నుంచి రూ.లక్షల్లో నగదు దోచుకెళ్లడం పోలీసులకే సవాలుగా మారింది. తాజాగా ఉత్తరాంధ్రలో ఏటీఎంల దోపిడీలు బ్యాంకర్లను కలవరపెడుతున్నాయి. నిన్న అనకాపల్లి, పెందుర్తి.. తాజాగా తగరపువలసలో ఏటీఎం చోరీ జరిగింది. ఏటీఎం మిషన్ కొల్లగొట్టి 14 లక్షలు చోరీ చేసిన దొంగల ఆచూకీ తెలియలేదు. నగర పోలీస్ కమిషనర్ సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితి సమీక్షించారు.

Advertisement

Next Story

Most Viewed