బంగారుపాలెంలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి

by srinivas |
బంగారుపాలెంలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి
X

దిశ ప్రతినిధి, చిత్తూరు: చేపల సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది. చేపల వేటకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు ప్రమాదవశాత్తు చెరువులో గల్లంతయి ఇద్దరు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే బంగారుపాలెం మండలం గుంత ఊరుకు చెందిన ముగ్గురు స్నేహితులు సమీపంలోని చెరువులో చేపలు వేటకు వెళ్లారు. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు ఇద్దరు నీటిలో మునిగిపోయారు. ఒకరు సురక్షితంగా బయటకు వచ్చారు. బంగారుపాలెం పోలీసులు చెరువు వద్దకు చేరుకొని తౌహీద్ (18), ఇర్ఫాన్ (19) మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed