CM Chandrababu:రాజస్థాన్ సీఎంతో ఫోన్‌లో మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి.. కారణం ఇదే!

by Jakkula Mamatha |   ( Updated:2024-10-08 15:15:13.0  )
CM Chandrababu:రాజస్థాన్ సీఎంతో ఫోన్‌లో మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి.. కారణం ఇదే!
X

దిశ ప్రతినిధి,ఎన్టీఆర్ జిల్లా: రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన విజయవాడ నుంచి వెళ్లిన న్యాయవాదుల బృందం బస్సు ప్రమాద ఘటనపై ఆ రాష్ట్ర సీఎంతో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. బాధితులకు అవసరమైన సహాయం అందించాలని కోరారు. ప్రమాదంలో విజయవాడకు చెందిన ప్రముఖ అడ్వకేట్ సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతి.. పలువురికి తీవ్ర గాయాలు ఘటనపై రాజస్థాన్ సీఎం తో మాట్లాడి ప్రమాద బాధితులకు మెరుగైన సాయం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఈ క్రమంలో అడ్వకేట్లు తిరిగి ఇంటికి రావడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed