- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
శ్రీసత్యసాయి జిల్లాలో చిరుత మృతి కలకలం
by Seetharam |
X
దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో చిరుతపులి మృతి కలకలం రేపుతోంది. బత్తులపల్లి మండలం డి.చెర్లోపల్లి గ్రామం వద్ద రైలు పట్టాలపై పులి మృతదేహం కనిపించింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు, రైల్వే శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టారు. చిరుత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించారు.బుధవారం తెల్లవారు జామున గ్రామంలోకి రావాలని రైల్వే ట్రాక్ దాటుతూ రైలు కింద పడి ప్రమాదవశాత్తు చిరుత చనిపోయి ఉండొచ్చని మరికొందరు చెప్తున్నారు. అయితే చిరుత గోళ్లు లేకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా వేటాడి చిరుత గోళ్లు తొలగించి రైలు కింద పడేశారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story