ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కలెక్టర్ల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

by Mahesh |
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కలెక్టర్ల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన కూటమి ప్రభుత్వం.. అధికారంలో రాగానే పాలనపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే అన్ని వ్యవస్థల పై ఫోకస్ పెట్టిన సీఎం పలువురు అధికారులకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం భారీగా కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. విశాఖ కలెక్టర్ గా హరీంద్ర ప్రసాద్, అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా చామకూరి శ్రీధర్, సత్యసాయి జిల్లా కలెక్టర్ గా చేతన్, కడప జిల్లా కలెక్టర్ గా లోతేటి శివశంకర్, నెలుర్ కలెక్టర్‌గా ఆనంద్, తిరుపతి జిల్లా కలెక్టర్ గా వెంకటేశ్వర్, పల్నాడు కలెక్టర్‌గా అరుణ్ బాబు, అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్‌గా రావిరాల మహేశ్ కుమార్, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గా శ్యామ్ ప్రసాద్, అనకాపల్లి కలెక్టర్ గా కె. విజయ, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా స్వప్నిక్ దినకర్, నంద్యాల కలెక్టర్ గా రాజకుమారిలను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story

Most Viewed