- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
కౌన్సిలర్ శంకర్ నాయక్ పై కేసు నమోదు..
![కౌన్సిలర్ శంకర్ నాయక్ పై కేసు నమోదు.. కౌన్సిలర్ శంకర్ నాయక్ పై కేసు నమోదు..](https://www.dishadaily.com/h-upload/2024/07/04/348885-web-image.webp)
దిశ, దుండిగల్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ గాగిల్లాపూర్ తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ 27వ వార్డు కౌన్సిలర్ శంకర్ నాయక్ పై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. వివరాలలోకి వెళితే గాగిల్లాపూర్ తండాకు చెందిన కొర్ర వసంత కుటుంబానికి చెందిన సర్వే నంబర్ 157, 158 లోని 5 గుంటల పట్టాభూమిని ఆక్రమించి ఓ నిర్మాణం చేపట్టడంతో బాధిత మహిళ పోలీస్ లను, మున్సిపల్ అధికారులను ఆశ్రయించింది.
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారన్న నెపంతో శంకర్ నాయక్, మోహన్ నాయక్, కొర్ర విజయ్ తదితరులు మహిళలను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు దాడికి యత్నించాడంటూ దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు కొర్ర శంకర్ నాయక్, మోహన్ నాయక్, విజయ్ నాయక్ లపై సెక్షన్ 323, 506 రెడ్ విత్ 34 ప్రకారం కేసు నమోదు చేసినట్లు దుండిగల్ సీఐ సీహెచ్ శంకరయ్య తెలిపారు.