పీసీబీ ఆఫీసులో ఫైల్స్ దగ్ధం.. షాకింగ్ కామెంట్స్ చేసిన పేర్ని నాని

by srinivas |
పీసీబీ ఆఫీసులో ఫైల్స్ దగ్ధం.. షాకింగ్ కామెంట్స్ చేసిన పేర్ని నాని
X

దిశ, వెబ్ డెస్క్: యనమలకుదురు పీసీబీ, మైనింగ్ శాఖ కార్యాలయానికి చెందిన ఫైల్స్‌, రిపోర్టులను సిబ్బంది కృష్ణానది కరకట్టపై దగ్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే డైవర్ ను అదుపులోకి తీసుకున్న విచారించారు. అయితే పీసీబీ ఓఎస్డీ రామారావు ఆదేశాలతోనే ఫైల్స్, రిపోర్డులను దగ్ధం చేసిన డ్రైవర్ చెప్పడంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను మాయం చేసేందుకే ఫైల్స్ ను దగ్ధం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

దీంతో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని స్పందించారు. కూటమి ప్రభుత్వంలో పీసీబీ ఫైల్స్ దగ్ధం జరిగితే ఆ తప్పులతో తమకేమీ సంబంధమని ఆయన ప్రశ్నించారు. ఆ ఫైల్స్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తగులబెట్టామా అని ప్రశ్నించారు. ఫైల్స్ దగ్ధంపై అవసరమైతే సీబీఐ, సీఐడీతో విచారణ జరిపించుకోవాలని సూచించారు. పత్రాలు తగులబెడుతుంటే అధికారంలో ఉన్న వాళ్లు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారని ఫీలవుతున్నారా అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.

Next Story

Most Viewed