వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌ల నియామకం

by Aamani |
వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌ల నియామకం
X

దిశ,దుగ్గొండి: గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రకటించిన నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి దుగ్గొండి మండలానికి పెద్ద పీట వేశారు. మండలానికి రెండు డైరెక్టర్ పదవులు, ఒక శాశ్వత ఆహ్వానిత సభ్యుడి పదవి లభించింది. మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన హింగే రామారావు, రంగాపురం గ్రామానికి చెందిన దంజ్యానాయక్ లను మార్కెట్ డైరెక్టర్ పదవి వరించగా కమిటీలో శాశ్వత సభ్యులుగా గుడి మహేశ్వరం గ్రామానికి చెందిన దుగ్గొండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బట్టు పైడి ను నియమించారు. తమ నియామకానికి సహకరించిన శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పాలాయి శ్రీనివాస్..


దిశ, నర్సంపేట : నర్సంపేట పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా నియోజక వర్గ సీనియర్ నాయకుడు పాలాయి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం రఘు నందన్ రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నర్సంపేట పట్టణానికి చెందిన పాలాయి శ్రీనివాస్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు పర్యాయాలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పని చేశారు. వైస్ చైర్మన్ గా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన శాఖమూరి హరిబాబు సహా 12 మంది కమిటీ సభ్యులు, నలుగురు శాశ్వత సభ్యులతో నూతన మార్కెట్ కమిటీ పాలక వర్గం కొలువుదీరింది.

నూతన పాలక వర్గం నేటి నుండి రెండేళ్ల కాల వ్యవధిలో పని చేయనున్నారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకానికి సహకరించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు లకు పాల్వాయి శ్రీనివాస్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story

Most Viewed