యూనిఫాం వేసుకోలేదని మందలించినందుకు.. టీచర్ ను కత్తితో పొడిచి చంపిన స్టూడెంట్

by Shamantha N |
యూనిఫాం వేసుకోలేదని మందలించినందుకు.. టీచర్ ను కత్తితో పొడిచి చంపిన స్టూడెంట్
X

దిశ, నేషనల్ బ్యూరో: అసోంలోని శివసాగర్ జిల్లాలో టీచర్ ని విద్యార్థి కత్తితో పొడిచి చంపాడు. శివసాగర్ లోని పాఠశాలలో పదకొండో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలుడు క్లాస్ రూంలోనే టీచర్ పై కత్తితో దాడి చేశాడు. శనివారం ఈ ఘటన జరిగింది. కెమిస్ట్రీ టీచర్ రాజేశ్ బారు బెజవాడ బాలుడ్ని మందలించాడని పోలీసులు తెలిపారు. అంతకుముందు రోజు, కెమిస్ట్రీలో మార్కులు తక్కువగా వచ్చాయని విద్యార్థిని మందలించిన టీచర్.. తల్లిదండ్రులను తీసుకుని మీటింగ్ కు రావాలని కోరినట్లు పేర్కొన్నారు. అయితే, తర్వాతరోజు యూనిఫాం వేసుకోకుండా విద్యార్థి క్లాస్ రూంకి వచ్చాడని వెల్లడించారు. దీంతో, క్లాస్ వదలి వెళ్లాలలని బాలుడ్ని టీచర్ తిట్టారని పోలీసులు వివరించారు. ఆ తర్వాత, అకస్మాత్తుగా టీచర్ పై విద్యార్థి కత్తితో పదేపదే దాడి చేసినట్లు చెప్పారు. ఆస్పత్రికి తరలించేలోగా టీచర్ చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇకపోతే, రాజేష్ బారు బెజవాడ కెమిస్ట్రీతో పాటు పాఠశాల అడ్మినిస్ట్రేషన్ కూడా చూస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మైనర్ నిందితుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed