కూలిన మట్టిమిద్దె - తప్పిన పెను ప్రమాదం..

by Sumithra |
కూలిన మట్టిమిద్దె - తప్పిన పెను ప్రమాదం..
X

దిశ, ధన్వాడ : మండల పరిధిలోని గోటూర్ గ్రామానికి చెందిన గౌని రవీందర్ రెడ్డి గౌని రమాదేవి దంపతుల సొంత ఇల్లు మట్టి మిద్దె కూలి పెను ప్రమాదం తప్పింది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి మట్టిమిద్దె కూలిపోయింది. కాని ఆ సమయంలో ఇంట్లో నివసిస్తున్న భార్యాభర్తలు ఇద్దరు మొహరం ప్రారంభ వేడుకలు చూడ్డానికి బయటికి రావడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఇంట్లో ఉన్న వస్తువులు ఫ్రిడ్జ్ టీవీ, ధాన్యం బస్తాలు, వంట సామాగ్రి, బట్టలు ఇతర వస్తువులు నేలమట్టమై దాదాపు 5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. వెంటనే ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed