రానున్న ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీదే.. ప్రముఖ సర్వే సంస్ద రిపోర్ట్..!

by Indraja |
రానున్న ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీదే.. ప్రముఖ సర్వే సంస్ద రిపోర్ట్..!
X

దిశ ప్రతినిది, విశాఖపట్నం: రానున్న ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లు కూటమికే దక్కుతాయన రైజ్ సంస్ద పేర్కొంది. ఎంపీ అభ్యర్దుల ఎంపిక తరువాత చేసిన సర్వే ఆదారంగా ఏప్రిల్ 1వ తేదీన ఫలితాలను వెల్లడించింది. ఎంపీ నియోజక వర్గంలో ఏడువేల మంది ఓటర్ల అభిప్రాయాల ఆధారంగా అంచనాకు వచ్చామని సంస్ద అధినేత ప్రవీణ్ పుల్లట తెలిపారు.

తమ సర్వే ప్రకారం రాష్ట్రంలోని 25 ఎంపీ స్ధానాలలో కూటమి 17 -19 సీట్లను కైవశం చేసుకొనే అవకాశంవుందని వెల్లడించారు. వైసీపీకి 7-9 స్దానాలు రావచ్చని.. 1-3 స్ధానాలలో గట్టిపోటీ వుంటుందని స్పష్టం చేశారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతి తదితర స్ధానాలలో కూటమి అభ్యర్దులు గెలుస్తారని, అరకు, రాజమండ్రి, నరసాపురం, కర్నూలు, కడప స్ధానాలు వైసీపీకి అనుకూలమని రైజ్ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed