ఈసారి ఊరుకోం.. పేర్నినాని, అమర్‌నాథ్‌కు బుద్దా వెంకన్న స్ట్రాంగ్ వార్నింగ్

by srinivas |
ఈసారి ఊరుకోం.. పేర్నినాని, అమర్‌నాథ్‌కు బుద్దా వెంకన్న స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రులు పేర్నినాని, గుడివాడ అమర్నాథ్‌పై టీడీపీ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తల్లికి వందనం పథకం’ విషయంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో పేర్నినాని, అమర్‌నాథ్‌ను ప్రజలు ఛీకొట్టారని, అందుకే మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆరడుగుల నిజాయితీకి చంద్రబాబు నిదర్శనమని, ఐదు అడుగుల తాచుపాము జగన్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల మయంగా మార్చితే .. ఈ నెల రోజులోనే చంద్రబాబు చాలా మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తేస్తే.. జగన్‌ను చూసి వారంతా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలు అన్ని చంద్రబాబు అమలు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఇదే నెలరోజుల్లో పదవులు పంచే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. నిజమైన ముసలివాడు జగన్ అని, 74 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు 24 ఏళ్ల కుర్రాడిలా పరుగులు పెడుతున్నారని తెలిపారు. జగన్ రాక్షస పాలన తట్టుకోలేక రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు మళ్లీ పట్టం కట్టారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. సంయమనం పాటించాలని తమను చంద్రబాబు ఆపారని, ఇంకోసారి అబద్ధాలు ప్రచారం చేస్తే ఊరికునేది లేదని బుద్దా వెంకన్న హెచ్చరించారు.



Next Story