AP Politics: లోకేష్ ఆ ఒక్క ఫోటో పంపు చాలు.. రాజకీయాల నుండి తప్పుకుంటా

by Indraja |

దిశ వెబ్ డిస్క్: రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు టీడీపీపై విమర్శల జల్లు కురిపించారు. 14 ఏళ్ళు సీఎం గా విధులు నిర్వహించిన చంద్రబాబు రాష్ట్రానికి పిసరంత సేవ కూడా చెయ్యలేదని ఆరోపించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటికి కేవలం రెండు పోర్టులు మాత్రమే ఉన్నాయని.. ఇది చాల బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. దశాబ్దం పైగా సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు కొత్తగా ఒక్క పోర్టు నిర్మాణం కూడా ఎందుకు చెయ్యలేదని ప్రశించారు. కనీసం శంకుస్థాపన కూడా ఎందుకు చెయ్యలేపోయారనేదే సూటిగా అడుగుతున్న ప్రశ్న అన్నారు. . అభివృద్ధిపై చర్చకు రావాలని నారా లోకేష్ కి సవాల్ విసిరాను.. కానీ ఆయన సవాల్ ను స్వీకరించలేదేమో చర్చకు రాలేదని పేర్కొన్నారు.

చంద్రబాబు హయాంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా ఒక్క నిర్మాణంగాని, శంకుస్థాపన గాని చేసిన పోర్టు లేదా హార్బర్ ముందు ఉండి తీసుకున్న ఒక్క ఫోటో పంపితే చాలు నేను రాజకీయాల నుండి తప్పుకుంటానని లోకేష్ కు సవాల్ విసిరారు. ఇక వైసీపీ పోర్టులు, హార్బర్ ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని.. జగన్మోహన్ రెడ్డి హయాంలో 8 పోర్టులు, 10హార్బర్ ల నిర్మాణంతో దేశం లోనే శక్తివంతమైన రాష్ట్రంగా ఏపీ అవతరించబోతుందని వెల్లడించారు. చిత్తశుద్ది అంటే ఇలా ఉండాలని.. సంపద సృష్టించటం అంటే ఇదేనని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత అర్ధాంగి నారా భువనేశ్వరి అసలు జిల్లా పర్యటనకు వచ్చిన విషయం ప్రజలకు తెలియదని విమర్శలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed