- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
అమీన్ పీర్ దర్గాలో సీఎం జగన్ ప్రత్యేక ప్రార్థనలు
X
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సొంత జిల్లా అయిన వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించారు. పెద్ద దర్గా (అమీన్ పీర్ దర్గా) ఉరుసు ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మజార్లకు ప్రభుత్వం తరపున సీఎం జగన్ చాదర్ సమర్పించారు. అనంతరం అమీన్ పీర్ దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు ఉరుసు ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్ షా అరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఆధ్వర్యంలో దర్గా ప్రాంగణంలో ఆయన శిష్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇకపోతే బుధవారం రాత్రి ముషాయిరా హాల్లో ప్రముఖ గాయకులతో ఖవ్వాలీ కచేరీ నిర్వహించారు. ఉరుసు ఉత్సవాలకు స్థానికులే కాకుండా బయటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండటతో ఇక్కడ సందడి నెలకొంది.
Advertisement
Next Story