- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మీరు ఎన్ని మంగళసూత్రాలు తెంచలేదు..? ప్రధాని మోడీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్డెస్క్: ఎన్నికల వేళ కాంగ్రెస్పై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలు మంగళసూత్రాలు తెంచి చొరబాటుదారులకు పంచి పెడుతుందంటూ ప్రధాని చేసిన కామెంట్స్పై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పదేళ్లలో దేశంలో చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేక కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు తెంచుతుందని.. మళ్లీ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రజల్లో ద్వేషం పెంచుతారా అని ప్రశ్నించారు. మరీ మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లు సృష్టించి ఎన్ని మంగళ సూత్రాలు తెంచలేదు..? ఇప్పుడు ప్రధానిగా ఉండి మణిపూర్ ఘటనతో ఎన్ని మంగళ సూత్రాలు తెంచలేదని కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ దేశ ప్రజల్లో ప్రేమను నింపే మాటలు మాట్లాడుతుంటే.. మోదీ మాత్రం మతాలను విడదీసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీకి దమ్ముంటే చేసిన అభివృద్ధి చెప్పుకోవాలి.. అంతేకానీ ముస్లింలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఇది బీజేపీకి, ఈ దేశానికి మంచిది కాదన్నారు. బీజేపీ ఈ దేశానికి చాలా ప్రమాదమని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశ, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని.. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాస్వామ్యానికి రక్షణ అని వ్యాఖ్యానించారు.