Big Breaking: కాంగ్రెస్ పార్టీ లో చేరడం పై స్పష్టత ఇచ్చిన షర్మిల..

by Indraja |
Big Breaking: కాంగ్రెస్ పార్టీ లో చేరడం పై స్పష్టత ఇచ్చిన షర్మిల..
X

దిశ వెబ్ డెస్క్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం అందరికి సుపరిచితమే. కాగా ఆమె కాంగ్రెస్ లో ఎందుకు చేరాల్సి వచ్చింది అనే విషయం పైన స్పష్టత ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆమె సాయంత్రం ఇడుపులపాయకు చేరుకున్నారు. అనంతరం ఇడుపులపాయ లోని వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు.

ఆ తరువాత మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. ఇక తాను రేపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను అని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇడుపులపాయకు వచ్చి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక తాను తన తండ్రి వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చడం కోసం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడం కోసం.. కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తానని ఆమె వెల్లడించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు తన పోరాటం ఆగదని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Next Story