పదేళ్ల పీడ విరగడైంది.. రోజా‌పై సొంత పార్టీ మహిళా నేత సంచలన వ్యాఖ్యలు

by Rajesh |
పదేళ్ల పీడ విరగడైంది.. రోజా‌పై సొంత పార్టీ మహిళా నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వైసీపీ ఘోర పరాభవం తర్వాత ఒక్కొక్కరు నేతలు తమ పార్టీ ముఖ్య నేతలపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా రోజాపై వైసీపీ అసమ్మతి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. రోజాపై నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ శాంతి ఘాటు విమర్శలు చేశారు. రోజా ఓటమితో నగరికి పట్టిన పదేళ్ల పీడ విరగడైందన్నారు. నగరి ప్రజలతో కలిసి ఆనందాన్ని పంచుకుంటున్నామన్నారు. రోజా అడుగుపెట్టినప్పటి నుంచి వైసీపీకి శని పట్టిందన్నారు. రోజాకు టికెట్ ఇవ్వకపోయి ఉంటే.. వైసీపీకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. నగరిలో రోజా కుటుంబ పాలనతో అక్రమాలకు పాల్పడిందన్నారు. రోజాను ప్రజలు చిత్తుగా ఓడించారని.. రోజా ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed